Saturday, January 22, 2011

జనవరి సంచిక 2011

పౌరహక్కుల యోధుడు డాక్టర్ బినాయక్ సేన్ జీవితశిక్షను వెంటనే రద్దు చేయాలి. బేషరతుగా విడుదల చేయాలి. రాయపూరు సెషన్స్ కోర్టు డాక్టర్ బినాయక్ సేన్ రాజద్రోహ నేరం , భారత రాజ్యానికి వ్యతిరేకంగా యుద్ధం చేయడం, కుట్ర చేయడం వంటి ఆరోపణలు రుజువయ్యాయని యావజ్జీవ కారాగారం శిక్ష విధించింది.

సాక్ష్యాలుగా రాయపూర్ జైలులో ఉన్న వృద్ధ మావోయిష్టు ఖైదీ నారాయణ సన్యాల్ నుండి ఒక లేఖ తీసుకెళ్ళి కలకత్తాకు చెందిన వ్యాపారి పీయూష్ గుహ కు అందించాడని, మావోయిష్టు పార్టీ ప్రచురించే మార్చ్ అనే 30 పత్రికలు ఆయన ఇంట్లో దొరికినవి, మొదటి ఆరోపణకు సాక్షులు పోలీసులే. మార్చ్ పత్రికలు పోష్టుద్వారా అందినవి , ఆ పత్రికలు నిషేధింపబడినవి కావు.

డాక్టర్ బినాయక్ పేద ప్రజల డాక్టరు. శిశు వైద్యంలో మాష్టర్ డిగ్రీ (యం.డి.) పొందిన వ్యక్తి. జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో అధ్యాపకుడుగా పనిచేశారు. గిరిజన ప్రాంతంలోనూ బొగ్గుగని కార్మికులకు స్వంతగా వైద్యశాల స్థాపించి వైద్యం చేశాడు. సల్వంజుడు అనే ప్రయివేటు సాయుధముఠా చేస్తున్న పనులను వ్యతిరేకించాడు. పౌర హక్కుల సంఘం కార్యదర్శిగా , అధ్యక్షుడుగా పనిచేసాడు. సల్వాంజుడుపై, పోలీసులపై కోర్టులో కేసులు పెట్టాడు.

బివాయక్ సేన్ సేవలను గుర్తించి ఇండియాలోని, విదేశాల్లోనుగల హెల్త్ ఫౌండేషన్లు ఆయనకు అవార్డులు ఇచ్చాయి. ఆశ ఫధకానికి ఈయన రూపొందించిన మితానిన్ కార్యక్రమమే ఆధారం.
బినాయక్ సేన్ పై విధించిన శిక్ష న్యాయసూత్రాలకు విరుద్ధమని ఓపిడిఆర్ భావిస్తుంది.

Thursday, June 25, 2009

మద్యానికే మహారాజ పోషణ

మద్యం అమ్మకాలను ఆదాయ వనరుగా చూడం. బెల్టు షాపులు రద్దు చేస్తాం. దశలవారీగా మద్య నిషేధాన్ని అమలు చేస్తాం. అని రాజశేఖర్ రెడ్డి పార్టీ 2004 లో తన ఎన్నికల ప్రణాళికలో చేసిన వాగ్దానమిది. ఈ ఐదేళ్ళలో రాష్ట్రంలో ఈ పార్టీ అందుకు పూర్తిగా భిన్నంగా ప్రవర్తించిది. మద్యం అమ్మకాలద్వారా ఏటా రు.12000కోట్ల ఆదాయం వస్తుంది.
పలు ఆర్ధిక, సామాజిక రుగ్మతలకు మూలకారణం మద్యమే. దీని వల్ల బాలకార్మిక వ్యవస్థ విస్తరిస్తుంది. మద్యానికి బానిసలై భర్త మరణించగా , బిడ్డల పోషణ భారంతో కుంగిపోతున్న మూడు పదులలోపు వయసు గల మహిళలు ఒక్క మెదక్ జిల్లాలోనే 16000 మంది ఉన్నారు. నేరాలూ ఘోరాలూ, హత్యలూ, అత్యాచారాలూ, ప్రకోపాలూ, ప్రమాదాలూ జరగడానికి మద్యమే ప్రధాన కారణం. వైన్ షాపుల వద్దే బహిరంగ మద్య సేవనం జరుగుతున్నా ఎవరూ పట్టించుకోవడంలేదు. రెండు రూపాయలు మాత్రమే విలువచేసే చీపు లిక్కరు సీసాను రు.50 వరకూ అమ్ముతూ పేదప్రజల కష్టార్జితాన్ని రాజశేఖరరెడ్డి ప్రభుత్వం దోచుకుంటుంది. కల్తీకల్లు మాఫియా రూపేణా మరో కాలనాగు బడుగుల జీవితాల్లో విషం చిమ్ముతుంది. మద్యం అమ్మకాలు మరింత జోరుగా సాగించి మద్యం అమ్మకాలు పెంచాలని ముఖ్యమంత్రి వైయ్యస్ రాజశేఖరరెడ్డి ఎక్సైజు శాఖ అధికారులకు హుకుం జారీ చేశాడు. అభివృద్ధే తమ ఎజండా అని ఢంకా బజాయిస్తున్న రాజశేఖర్ రెడ్డి మద్యం అమ్మకాల్లో దాన్ని సాకారం చేశారు. మాటమీదకాదూ మద్యం మీద నిలబడతానని నిరూపించుకున్నాడు. ఎన్నికల సమయంలో కోట్లరూపాయల అక్రమమద్యం పట్టుబడింది. ధనం ,ద్రవం ఎన్నికల ఫలితాలను శాసించినంతకాలం ప్రజాస్వామ్యం తప్పటడుగులు వేయకతప్పదు.

Tuesday, June 23, 2009

"నస్త్రీ స్వాతంత్ర్యమర్హతి " అన్న విలువకు బొంద పెట్టాలి

మతం మనుషుల మెదళ్ళపై పెత్తనం చేస్తున్నది. ప్రతి మతం స్త్రీని పురుషుడికి సంబంధించిన ఒక వస్తువుగా చిత్రీకరించింది. వీటి ప్రకారం స్త్రీ పిల్లల్ని కనే ఓ యంత్రం. పురుషుడి ఆస్తికి వారసుడిని కనలేకపోతే విసర్జించాల్సిన యంత్రం. ఒక క్రమంలో రాజుల, జమీందారుల, భూస్వాముల భోగవస్తువు. నేటి వ్యాపార సమాజంలో స్త్రీ వర్తకపు సరుకు. పురుషుడి విసృంఖల కామానికి బలి పశువుగా మారింది.

కొన్ని సంవత్సరాల క్రితం క్రింది వర్గాల స్త్రీలపై పెత్తందారుల దౌస్ట్యాల గురించి వింటూ వుండేవారం. నేడది సర్వ వ్యాపితమైంది. పూరి గుడిసెల్లోకి కూడా చొరబడిన టి.వి.లు యువకుల్లో నీచ కామాన్ని రెచ్చగొడుతున్నాయి. ప్రేమ స్థానాన్ని కోరిక ఆక్రమించింది. దానికి తరతరాలుగా పాతుకుపోయిన పురుషాధిపత్యం సంస్కృతి " మంటకు పడమటి గాలిలా " తోడైంది. నాలుగు గోడల వెలుపల జరిగే సంఘటనలే మానవ విలువలను వణికిస్తున్నాయి. నాలుగు గోడల నడుమ అనునిత్యం కోట్లాదిమంది స్త్రీలు అనుభవిస్తున్న నరకయాతనలు మొత్తంగా వెలుగుచూస్తే పురుష వ్యతిరేక స్త్రీ టెర్రరిష్టు గ్రూపులెందుకు ఏర్పడడంలేదా అని ఆశ్ఛర్యం కలుగకమానదు. మానవజాతి పునరుత్పత్తి భారాన్నంతటినీ ఏమనిషి మోస్తున్నదో , ఆస్త్రీపై చిత్తకార్తె కుక్కల్లా అన్ని కార్తెల్లో ఎగబడుతున్న పురుష కామాంధతకు వ్యతిరేకంగా ఒక మహూద్యమం సాగాల్సివుంది. అందుకోసం ముందుగా ప్రగతిశీల మహిళా సంఘాలు, హక్కుల సంఘాలు, తక్షణ, దీర్ఘకాలిక , సమష్టి కార్యక్రమాన్ని రూపొందించుకోవాలి.

Thursday, February 22, 2007

Janapadham

Mahasamraajyaanni prathighatiddam.
aikyarajya samithiloo venijula aduakshudu Chavej prasangam.